Take a fresh look at your lifestyle.

మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి: పార్లమెంటు సభ్యులకు ప్రధాని మోదీ పిలుపు

0 35

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంగా ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ చరిత్రాత్మక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి చరిత్ర సృష్టించాలని ఆయన పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇది దేశంలోని సగం జనాభా అయిన మహిళలకు దక్కాల్సిన హక్కు అని, వారి శక్తికి కొత్త అవకాశాలు కల్పించాలని కోరారు.

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ అమలు కోసం ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ బిల్లును 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమలు చేయడమే లక్ష్యంగా అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాత ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, “దయచేసి మీ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోండి. మీ కుటుంబంలోని మహిళలను గుర్తుచేసుకోండి. ఇది మహిళలకు మనం ఇస్తున్నాం అనుకోకండి… యుగాలుగా వారికి నిరాకరించబడిన హక్కును తిరిగి ఇవ్వడం మన బాధ్యత అని గుర్తించండి” అని పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం ఘనతను ప్రతిపక్షాలే తీసుకోవచ్చని, తనకు క్రెడిట్ అవసరం లేదని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం లోక్‌సభలో ఈ బిల్లులపై చర్చ కొనసాగుతుండగా, శుక్రవారం సాయంత్రం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందితే దేశ ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.